విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు

Описание к видео విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో నేడు ఉదయం అల్పాహారం అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 30 మంది విద్యార్థులకు అస్వస్థత ఏర్పడడంతో రామాయంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్పాహారంలో బల్లి పడడం కొందరు గమనించామని విద్యార్థులు తెలిపారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆహారంలో బల్లి పడి ఫుడ్ పాయిజన్ జరిగిందనే విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Комментарии

Информация по комментариям в разработке