పేద ప్రజల వైద్య విద్య హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
• ఆర్డీవో కార్యాలయ ఏవోకు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన మెమోరాండం సమర్పణ!
శ్రీకాళహస్తి:
పేద మరియు మధ్యతరగతి ప్రజలకు దక్కాల్సిన వైద్య విద్య, వైద్య సేవలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ఆధ్వర్యంలో అపూర్వమైన నిరసన ర్యాలీ జరిగింది.
శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,MLC సిపాయి సుబ్రమణ్యం నిస్వార్థ నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఉద్విగ్నంగా ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివెళ్లి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
అనంతరం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకుల బృందం ఆర్డీవో గారిని కలిసి,పేద విద్యార్థులు మరియు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ, ఈ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెమరాండంను సమర్పించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు మరియు పట్టణ ప్రాంతం నుండి భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం,పేదలకు ఉచితంగా వైద్యం అందాలనే ఆకాంక్షతో వందలాది మంది సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ ఉద్యమానికి మద్దతు పలికారు.ఈ అపూర్వ స్పందన పేద ప్రజల వైద్య విద్య హక్కు పట్ల వారికున్న ఆవేదనను స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలారా, ఈరోజు పేదల హక్కులను కాలరాస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా,వైద్య విద్య, వైద్యం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనమంతా ఏకమై అపూర్వమైన నిరసన తెలియజేశాం.ఈ భారీ జనసందోహం ప్రజల ఆవేదనకు అద్దం పడుతోంది.
వైద్యం అమ్ముకునే వస్తువు కాదు, అది పేదవాడి హక్కు! విద్య వ్యాపారం కాదు, అది ప్రతి బిడ్డ భవిష్యత్తు.పేద ప్రజలకు అందాల్సిన వైద్య విద్యను, వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.ఇది పేదలను దోచుకునే చర్య.మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసే కుట్ర.ప్రజల భాగస్వామ్యాన్ని చూసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కళ్లు తెరవకపోతే,రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంతకంటే పెద్ద ఉద్యమం తథ్యం అని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డి,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, తిరుమలరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి,బర్రి సుదర్శన్ రెడ్డి,జడ్పీటీసీ సంధ్య రాణి,శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్,తొట్టంబేడు మండల అధ్యక్షుడు కోగిలి సుబ్రహ్మణ్యం,రేణిగుంట మండల అధ్యక్షుడు గంగారి రమేష్,ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి,కోవి చంద్రయ్య నాయుడు, రేణిగుంట సర్పంచ్ నగేష్, రేణిగుంట టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్, కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష,యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బుల్లెట్ జయశ్యం రాయల్,మున్నా రాయల్, వయ్యాల మనోహర్ రెడ్డి,యువజన విభాగం అధ్యక్షుడు సురావారి సురేష్ ,గోర, ఉత్తరాజి శరవణ కుమార్,కంట ఉదయ్ కుమార్,మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ పటాన్ ఫరీద్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మునికృష్ణ రెడ్డి,డాక్టర్ wing ప్రెసిడెంట్ శంకర్,ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పసల కృష్ణయ్య,ఫజల్,కొల్లూరు హరి నాయుడు, పసల సురేష్, గౌస్ భాష,నారాయణ,శివ కుమార్ యాదవ్,ముద్దుమూడి రవి,సురేంద్ర యాదవ్, ఆశ కిరణ్,మహబూబ్ బాషా,ఆరిఫ్,ఫిరోజ్,బాబు,పులి రామచంద్ర, కంచి గురవయ్య,పంతులు,చెలికం నాగరాజు రెడ్డి,ఆర్కార్డ్ ముత్తు ,కుమార్ ,అస్లాం, సుమతమ్మ,సాగిర బి, షర్మిల ఠాగూర్, సునీత సింగ్,భారతమ్మ,చెంచయ్య నాయుడు,భాస్కర్ ముదిరాజ్,టైలర్స్ శ్రీను,ఖదీర్ బాయ్,అస్సన్ సాహెబ్, షబ్బీర్, ఇరానీ ఖాదర్,బుజ్జమ్మ, పర్వీన్, జ్యోతి, కళావతి, సుబ్రహ్మణ్యం నాయుడు,శ్రీరాములు రెడ్డి,ఆర్ట్ మణి,ఊరందూర్ రంగయ్య,రాజేంద్ర,బావాజీ,దేవిక,రాజు, మోహన్ రెడ్డి, రాజారెడ్డి,కేశవ,
దాస సుబ్రమణ్యం,మణి,చింతా రాజేంద్ర, గడిపాకుల కిరణ్,కాణిపాకం సురేష్,గంగాధరం,మల్లి మొదలియార్, పుల్లయ్య, జై చంద్రారెడ్డి, అట్ల రమేష్,బాలిశెట్టి శేఖర్, సాయిబాబా నాయుడు, ఆర్కార్డ్ శేఖర్, మనీ నాయుడు, వాసు ,అంకయ్య,మహేష్ ,ఈశ్వరయ్య,జీవీకేరెడ్డి, జై కృష్ణారెడ్డి అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు,అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు,మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.పేద ప్రజల పక్షాన తమ పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
Информация по комментариям в разработке