తిరుమల వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ సమీక్ష.
డిసెంబర్ 23న, వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల.
24న, ఎస్ఈడీ టికెట్లు విడుదల.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో, వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు, నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై, మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సి హెచ్ వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో, సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో, చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
23న ఉదయం 11 గంటలకు, వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి, 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల.
24న ఉదయం 11 గంటలకు, వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి, 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల.
జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ ఎస్ డి టోకెన్లు కేటాయింపు.
తిరుపతిలో ఎం ఆర్ పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు.
టోకెన్ జారీ కేంద్రాలు వద్ద, భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈ కి ఆదేశం.
టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు. కానీ దర్శన క్యూ లైన్లలోకి అనుమతించరు.
వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4 గంటల 45 నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం.
వైకుంఠ ఏకాదశి రోజున, అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు.
వైకుంఠ ఏకాదశి రోజు, ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వర్ణ రథం.
వైకుంఠ ద్వాదశి రోజున, ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు, శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.
గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.
వైకుంఠ ఏకాదశి రోజున, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో, తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన.
ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా, అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం.
టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ.
లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా, ప్రతిరోజూ అందుబాటులో 3 లక్షల 50 వేల లడ్డూలు. అదనంగా 3 లక్షల 50 వేల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు.
Информация по комментариям в разработке