ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
Facebook.............. / praveenmohantelugu
Instagram................ / praveenmohantelugu
Twitter...................... / pm_telugu
Email id - praveenmohantelugu@gmail.com
మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
00:00 - పురాతన విగ్రహం కనుగొనబడింది
02:35 - ఖననం చేయబడిన ఆలయం కనుగొనబడింది
04:55 - ఏకశిలా నంది విగ్రహాలు
06:56 - ఐదు తలల ఏకశిలా నాగుపాము త్రవ్వబడింది
07:12 - అయోధ్య తవ్వకం
10:20 - నీటిలో నుండి బయటకు వచ్చిన లింగాలు
11:45 - ముగింపు
Hey guys, ఈ రోజు మనం భారతదేశంలో దొరికిన కొన్ని షాకింగ్ ఐన పురాతన కళాఖండాల గురించి మాట్లాడబోతున్నాము. ఈ క్లిప్ ని ఒకసారి చూడండి. ఈ క్లిప్ను నాకు పంపిన వ్యక్తి ఇది కీలడి అనే archaeological siteలో కనుగొనబడిందని చెప్పారు, కానీ ఇది ఆ సైట్లోనే దొరుకుంటుందని నాకు అనిపించలేదు. కీలడి అనే స్థలం ఒక protect చేయబడిన archaeological site, అది మాత్రమే కాకుండా archaeologistsలు మాత్రమే ఆ ప్రదేశంలో తవ్వగలరు. వందలాది మంది ఈ పురాతన విగ్రహాన్ని ఎలా పైకి లాగుతున్నారో అని చూస్తుంటే మరెక్కడో కనుగొనబడిందని తెలుస్తుంది, ఇది ఇంటిని కట్టడానికి తవ్వేటప్పుడు లేదా నీటి బావి కోసం భూమిని తవ్వినప్పుడు అనుకోకుండా ఇది దొరుకుంటుందని మనకు బాగా అర్ధమైంది. అక్కడ ఉన్న స్థానికుల వల్లే ఇలాంటి అనేక archaeological వస్తువులు బయటపడుతున్నాయి, ప్రజలందరూ ఎంత ఉత్సాహంగా, excitedగా ఉన్నారో అని మీరు చూడవచ్చు.
ఇది ఖచ్చితంగా ఒక పురాతన విగ్రహమే, బహుశా ఇది దాదాపు వెయ్యి సంవత్సరాల నాటిదై ఉండవచ్చు. ఈ విగ్రహంలో ఉన్నది నటరాజు, ఇది నిర్దిష్ట రూపంలో శివుడిని చూపుతుందని మనకు బాగానే తెలుసు, అది మాత్రమే ఇలాంటి bronzeతో చేయబడిన నటరాజుని విగ్రహాలన్నీ దాదాపు 1000 సంవత్సరాలకు ముందు పరిపాలించిన చోళుల రాజవంశం కాలానికి చెందినదైయుంటుంది. సరే, ఇప్పుడు భూగర్భంలో పాతిపెట్టబడిన నటరాజుని యొక్క అద్భుతమైన విగ్రహాన్ని చూసాము మరియు అనేక శతాబ్దాల తర్వాత ఇప్పుడే బయటపడింది కదా. కానీ మన నెల్లూరులో ఒక గుడి మొత్తం భూమికి లోపల ఇప్పటి వరకు పాతిపెట్టబడింది, 2021లో ఇది కొంచం బయటకు వచ్చింది. అప్పట్లో కోవిడ్ 19 కారణంగా వాళ్ళందరూ మాస్క్లు వేసుకుని ఉండడం మనం చూడవచ్చు. ఇది కూడా accidentalగానే కనుగొనబడింది, ఇక్కడ వాళ్ళు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు, ఎందుకంటే commercial purpose కోసం ఇసుకను బయటికి తీస్తున్నారు, అప్పుడే అనుకోకుండా పూర్తిగా మట్టిలో పాతిపెట్టబడిన ఒక పెద్ద ఆలయాన్ని వాళ్ళు చూసారు.
ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఇసుకను తీస్తుండడం మనమే చూస్తున్నాము కదా, దానిని చూసి ఇది నెల మట్టం అని మీరు అనుకోవచ్చు. కానీ అది కాదు, వాళ్ళు దాదాపు ఆలయ గోపురం పైన నిలబడి ఉన్నారు. గోపురంపైన ఏర్పాటు చేసిన దేవతను వాళ్ళు ఎలా క్యాజువల్గా reveal చేస్తున్నారో మీరు చూడండి. అది అంతా సరే గాని, ఈ ఆలయం యొక్క ప్రవేశ ద్వారం ఎక్కడ ఉంది? అది ఇసుక లోపల పాతిపెట్టబడింది. అప్పుడు వాళ్ళు ఒక పెద్ద ఎక్స్కవేటర్లను ఉపయోగించి, ఆ ఆలయం యొక్క ప్రవేశాన్ని వెలికితీశారు. ఆ యంత్రం లోపలికి వెళ్లి ఆ ఆలయ ప్రవేశద్వారం లోపల నుండి ఇసుకను తొలగిస్తోంది. చివరగా, మనం ఆ ఆలయం యొక్క నేల స్థాయిని చూడగలుగుతున్నాము. ఇదే ఈ ఆలయ ప్రవేశ ద్వారం. నేల మట్టాన్ని దగ్గరగా చూస్తున్నపుడే, ఈ ఆలయం ఇటుకలతో నిర్మించబడిన దాన్ని మరియు ప్లాస్టర్ చేయబడిన గోడలను కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము.
దాదాపు ఈ గోడలను ఎవరూ తాకలేదనుకుంటాను, ఎందుకంటే వాటిపై ఎలాంటి damage లేదు ఎక్కువ నష్టం జరగలేదు. మరియు లోపల మరిన్ని గదులు ఉన్నాయి, అంతేకాకుండా లోపల ఎక్కువ గోడలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రవేశ ద్వారం దగ్గరికి వెళ్లి లోపల ఏముందో అని చూద్దాం రండి. ఇటుకలతో కట్టిన గోడలు మరియు ఇటుకలతో కట్టిన ద్వారం కూడా ఉంది. ఇది ఒక శివాలయం అని, లోపల లింగం ఉందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఈ గోపురాన్ని మీరు దగ్గరగా చూసినప్పుడు, ఇది కూడా ఇటుకలతో నిర్మించబడి, సున్నపు మోర్టార్తో ప్లాస్టర్ చేయబడిందని మీరు గ్రహిస్తారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో మరియు బాబర్ మసీదుగా అని పిలువబడే బాబర్ రాజు యొక్క మసీదు ఉన్న ప్రదేశంలో కూడా చాలా ముఖ్యమైన archaeological పరిశోధనలు జరిగాయి. అయితే మనం దీనిని పరిశీలించే ముందు, అరసినకెరె అనే ఒక చిన్న గ్రామంలో వెల్లడైన కొన్ని మనోహరమైన పురాతన కళాఖండాలను మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇక్కడ వాళ్ళు చాలా విచిత్రమైన దాన్ని కనిపెట్టారు.
ఒకే రాయితో చేయబడిన రెండు పెద్ద ఏకశిలా నంది విగ్రహాలు, నంది శివుని యొక్క వాహనం అని మనఅందరికి బాగానే తెలుసు. మరియు సాధారణంగా, మనం కేవలం ఒక నంది మాత్రమే ఉంటుందని అనుకుంటాము, కానీ మనం షాక్ అయ్యే విధంగా ఇక్కడ రెండు నంది విగ్రహాలను చూస్తున్నాము. ఈ పెద్ద నందులు ఇంచుమించు 15 అడుగుల పొడవుగా మరియు 12 అడుగుల ఎత్తుగా ఉన్నాయి, కాబట్టి ఇది చాలా పెద్దది ఇంకా మరొకటి దీని కంటే కొంచెం చిన్నది. ఇంకా దీనిని తవ్వినది కూడా archaeology department కాదు, ఆ ఊరి గ్రామస్థులు దానిని కనిపెట్టి, ఆపై వాళ్ళు అధికారులకు సమాచారం ఇచ్చారు. అది మాత్రమే కాకుండా ఈ నందులు పూర్తిగా చెక్కబడలేదు. ఇది నాకు ఎలా తెలుసు అనే కదా మీరు అడుగుతున్నారు, కరెక్ట్ గా చెప్పానా?ఎందుకంటే, వాటి కళ్ళను చూడండి, అందులో నల్లగా ఉండే ఆ నల్లగుడ్డు కనిపించలేదు, దీనర్ధం ఏంటంటే కళ్ళు ఇంకా పూర్తి కాలేదు. శిల్పులు ఎప్పుడూ కూడా చివరిగానే కళ్ళను చెక్కుతారు, అంటే అన్నిటిని పూర్తిగా చెక్కిన తర్వాతే కళ్ళను చెక్కడం అనేది పురాతన కాలంలో నుండి ఇప్పటివరకు భారతదేశంలో ఒక ఆచారంగా ఉంది.
#ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu
Информация по комментариям в разработке