కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కామెంట్స్#

Описание к видео కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కామెంట్స్#

మా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో దాడికి గురైన వారిని పరామర్శిస్తున్నాం.

సింహాద్రిపురం మండలం లో దాడికి గురైన అబ్బాస్,ప్రతాప్ రెడ్డి వల్లిలను పరామర్శించి మనోధైర్యం ఇచ్చాం.

తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నెల రోజుల్లోనే వేల మంది వైకాపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్ఢారు.

లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు.

నిన్న గుంటూరులో వేల మంది చూస్తుండగా వైకాపా కార్యకర్త రషీద్ పాశవికంగా దాడి చేసి హత్య చేశారు.

వేంపల్లె లో అజయ్ రెడ్డి పై హాకీ స్టిక్ లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

రాష్ట్రంలో కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు.

సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాం అంటున్నారు.

గత ఐదేళ్లలో మేము అలా అనుకొని ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండేవారు కాదు.

మా నాయకుడు అలాంటివి ప్రోత్సాహించలేదు.
పార్టీలు ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాలనే మా నాయకుడు ఆలోచించారు.

తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే పులివెందుల ఇసుక డిపోలో నిల్వ ఉన్న 60 వేల టన్నుల ఇసుక మాయం అయింది.

Комментарии

Информация по комментариям в разработке