రాష్ట్ర ప్రభుత్వానికి వీరశైవ లింగాయతుల డిమాండ్ | veeraa saiva lingayat | Yodha news

Описание к видео రాష్ట్ర ప్రభుత్వానికి వీరశైవ లింగాయతుల డిమాండ్ | veeraa saiva lingayat | Yodha news

#anantapur #apcm #narachandrababunaidu

వీరశైవ లింగాయతులు, జంగమలకు రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అనంతపురం జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షులు ఎం.జీ.రాజు, వీరశైవ సమాజం జిల్లా సెక్రెటరీ గౌరీ సతీష్ కుమార్, జిల్లా వీరశైవ జంగమ అధ్యక్షులు మఠం తిప్పేస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును డిమాండ్ చేశారు. శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడంతోపాటు బోర్డులో సభ్యులుగా వీరశైవులకు చోటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులుగా వీరశైవులకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధిక సంఖ్యలో వీరశైవులు ఉన్నారని వీరశైవ నాయకులు పేర్కొన్నారు. తిరుమలలో కళ్యాణ మండపం తోపాటు దర్శనం కోసం వచ్చిన వారికి ఉండటం కోసం స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Комментарии

Информация по комментариям в разработке