Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ఐ ఐ ఎం సి లో విజయవంతమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు

  • Nandini TV
  • 2026-01-20
  • 8
ఐ ఐ ఎం సి లో విజయవంతమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు
NandiniTvNandini Tv NewsNandini Tv ChannelNandiniNandini NewsNandini Channel
  • ok logo

Скачать ఐ ఐ ఎం సి లో విజయవంతమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ఐ ఐ ఎం సి లో విజయవంతమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ఐ ఐ ఎం సి లో విజయవంతమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ఐ ఐ ఎం సి లో విజయవంతమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు

ఐ ఐ ఎం సి లో విజయవంతమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు

ఖైరతాబాద్, తేదీ: 20: ఐ ఐ ఎం సి కళాశాలలో జనవరి19, 20 వ తేదీలలో "నావిగేటింగ్ కంప్లెక్సీటిస్ ఇన్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీ త్రో వికసిత్ భారత్ 2047" అనే అంశంపై రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును కళాశాలలోని చల్లా సోమ్ రాజ్ రామ్ సభా ప్రాంగణంలో నిర్వహించారు. సదస్సు మొదటి రోజు ప్రత్యక్ష పద్ధతిలో, రెండవ రోజు అంతర్జాల మాధ్యమం ద్వారా సదస్సును నిర్వహించారు. మొదటి రోజు ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలనతో సదస్సును ప్రారంభించారు. అనంతరం సభాధ్యక్షులు, కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక సరికొత్త అంశంతో అధ్యాపకులలో పరిశోధన పట్ల జిజ్ఞాస కలిగిస్తూ సదస్సులు నిర్వహించడం ఐ ఐ ఎం సి కే చెందుతుందని, ప్రతి పరిశోధకుని ఆలోచనా విధానం మార్పుకు నాంది కావాలని తెలియజేశారు.
సదస్సు సంచాలకులు వాణిజ్య శాస్త్ర సహాయ అధ్యాపకురాలు సముద్రాల శ్రావణి సదస్సు లక్ష్యాన్ని, ముఖ్యోద్దేశాన్ని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగం పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఆచార్య పాట్రిక్ మాట్లాడుతూ వాణిజ్య శాస్త్ర అంశాలలో సదస్సులు , ప్రాజెక్టు వర్క్ పై వర్క్షాప్, కామర్స్ టాలెంట్ టెస్ట్ ఇలా ఏది నిర్వహించాలన్నా ఐ ఐ ఎం సి కళాశాల ముందుంటుందని తెలుపుతూ విద్య, పరిశోధన మరియు సాంకేతికతలోని అంతరాలు తగ్గించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని ఆ దిశగా ఈ సదస్సులోని విలువైన పరిశోధనా పత్రాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నానని తెలియజేశారు.
మరియు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగ ఆచార్యులు చేతన్ శ్రీ వాత్సవ సదస్సునుద్దేశించి కీలకోపన్యాసం ఇస్తూ ఈ వసుదైక కుటుంబంలో విలువలతో కూడిన విద్యా విధానము అనుసరించడం ద్వారా దానికి సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం సులువు అయితుందని తెలియజేశారు. అనంతరం ISBN నంబర్ తో కూడిన 75 వ్యాస సంగ్రహాలతో పొందుపర్చిన సంకలనాన్ని (సావనీర్) ముఖ్య అతిథిచే ఆవిష్కరింపచేసి వ్యాస కర్తలకు అందజేశారు. అంతర్జాలం ద్వారా రెండవ రోజు జరిగిన సదస్సులో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు సొల్యూషన్స్, జీ ఈ ఏ నార్త్ అమెరికా ఉపాధ్యక్షులు డా.రామ్ కుమార్ మాట్లాడుతూ మానవులలోని నైపుణ్యాలని కృత్రిమ మేథతో అనుసంధానం చేయడం ద్వారా, సుస్థిరాభివృద్ధి సాధిస్తూ వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ రెండు రోజులలో ఆఫ్ లైన్, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా వివిధ విభాగాలకు సంబంధించిన 126 మంది పరిశోధకులు 47 పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలనుండే కాక, ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి కూడా పరిశోధకులు తమ వ్యాసాల ద్వారా వారి అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ఈ రెండు రోజుల సదస్సులో కామర్స్ మరియు మేనేజ్మెంట్ కు ప్రొ. సత్యనారాయణ మూర్తి, ప్రొ. సుధాకర్, డా. రామకృష్ణ, డా. సీమా నజనీన్, తెలుగు సాహిత్యానికి తిరునగరి శరత్ చంద్ర న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సదస్సు ముగింపు సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ కూర రఘు వీర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో నిర్వహించిన మా సదస్సు ద్వారా కొన్ని లక్ష్యాలు నెరవేరాయని తెలుపుతూ సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలలో వివిధ విభాగాల నుండి ఉత్తమ పరిశోధనా పత్రాలను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. అందులో కామర్స్ విభాగంలో మొదటి బహుమతి మహమ్మద్ జహీరుద్దీన్ (అరబ్ కంట్రీ ఒమన్) , పిన్నింటి శివకుమార్, ద్వితీయ బహుమతి డా.మురళీధర, డా. తులసి, తృతీయ బహుమతి ఎం. దెబోరా, అఫిఫా సిద్ధికీ, మేనేజ్మెంట్ విభాగంలో ప్రథమ బహుమతి శ్రీరంగం యోగితా సాయి, ప్రవల్లిక, ద్వితీయ బహుమతి సువర్చలా రాణి, డా. వి. అశ్విని అచ్యుతాంబ, తృతీయ బహుమతి డాక్టర్ మాధవి, ఎకనామిక్స్ విభాగంలో ప్రథమ బహుమతి డాక్టర్ సాత్విక, డా. ఖాజా మొహిద్దిన్, సంపత్ కుమార్ ద్వితీయ బహుమతి డా. నాగలక్ష్మి, తృతీయ బహుమతి మల్లన్న స్వామి, భాషా సాహిత్యాల నుండి ప్రధమ బహుమతి డాక్టర్ హార్ధ రాజేష్ కుమార్ (హిందీ విభాగంలో), ద్వితీయ బహుమతి ఆర్.ఎస్. సంధ్య (తెలుగు విభాగంలో), తృతీయ బహుమతి ఏ జ్యోతి (ఆంగ్ల విభాగంలో) గెలుచుకున్నారు. ఆయా స్థానాలలో నిలిచిన ప్రతి విభాగం వారికి వరుసగా 1500, 750, 500 నగదు ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సదస్సులో కళాశాల డీన్లు డా డి.తిరుమలరావు, డా. జి. సంతోషి, సదస్సు సహా సంచాలకురాలు లైబ్రేరియన్ డా. జి. రమాదేవి, కళాశాలలోని అన్ని విభాగాల అధ్యక్షులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర కళాశాలల నుండి కూడా అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో విచ్చేసి సదస్సును విజయవంతం చేశారు.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]