Sai Gurukulam Episode1313 //సాయిభక్త శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గురుభక్తి రహస్యం

Описание к видео Sai Gurukulam Episode1313 //సాయిభక్త శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గురుభక్తి రహస్యం

Sai Gurukulam Episode1313 //సాయిభక్త శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గురుభక్తి రహస్యం

బొంబాయికి చెందిన ప్రఖ్యాత న్యాయవాది హరిసీతారాం దీక్షిత్ అలియాస్ కాకాసాహెబ్ దీక్షిత్. 1909 వరకు అతనికి సాయిబాబా పేరే తెలియదు. కానీ, ఆ తరువాత అతను శ్రీసాయికి పరమ భక్తునిగా ప్రసిద్ధిగాంచాడు. ఋణానుబంధం వలన బాబాతో ముడిపడివున్న ఎంతోమంది భక్తులను శిరిడీకి రప్పించడంలోనూ, వాళ్ళకు బాబాపట్ల భక్తిశ్రద్ధలు ఏర్పడటంలోనూ అతనొక మిష అయ్యాడు. శిరిడీ సాయి సంస్థాన్ స్థాపనలో, దాని పురోగతిలో దీక్షిత్ పాత్ర ఎంతో కీలకమైనది. 1926, జులై 5న తనకు అంతిమఘడియలు సమీపించేవరకు సంస్థాన్ గౌరవ కార్యదర్శిగా అతనెంతో ఉత్సుకతతో సమర్థవంతంగా సంస్థాన్ వ్యవహారాలు నిర్వర్తించాడు. సంస్థాన్ ద్వారా వెలువడిన సాయిలీల ద్వైమాసిక పత్రిక (మరాఠీ) నిర్వహణలో కూడా అతని కార్యదక్షత ఎనలేనిది. 1926, జులై వరకు ఆ పత్రికలో అతనివి, అతని స్నేహితులవి 151కి పైగా అనుభవాలు ప్రచురితమయ్యాయి. అవి ఇప్పటికీ సాయిభక్తులకు మార్గనిర్దేశం చేస్తూ బాబా ప్రేమకు పాత్రులను చేస్తున్నాయి.

1864వ సంవత్సరంలో మధ్యప్రదేశ్‌నందు గల ఖాండ్వాలోని ఉన్నత నగరి బ్రాహ్మణ కుటుంబంలో గొప్ప పలుకుబడి, సంపద ఉన్న దంపతులకు హెచ్.ఎస్.దీక్షిత్ జన్మించాడు. అతని ప్రాథమిక విద్య ఖాండ్వా, హింగన్‌ఘాట్‌లలో జరిగింది. మెట్రిక్‌లో ప్రథమశ్రేణి సాధించిన తరువాత ఎఫ్.ఏ, బి.ఏ పూర్తిచేసి, అనంతరం పంతొమ్మిదేళ్లకే బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో ఎల్.ఎల్.బి పట్టభద్రుడయ్యాడు. తర్వాత 21 ఏళ్ల వయసులోనే సొలిసిటర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత అతను న్యాయవాదిగా ‘లిటిల్ అండ్ కంపెనీ’లో చేరి అతి తక్కువ కాలంలోనే ప్రఖ్యాత న్యాయవాదిగా స్థిరపడ్డాడు. తరచూ అతని పేరు పత్రికలలో, న్యాయ నివేదికలలో కనిపిస్తుండేది. ఉదాహరణకు, భావనగర్ ఎక్స్‌పోజర్స్, పూనా వైభవం మొదలైన ప్రఖ్యాత దేశీయ పత్రికలపై జరిపిన న్యాయవిచారణలోనూ, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మరియు గ్లోబ్&టైమ్స్ అఫ్ ఇండియా మొదలైన సంచలనాత్మక కేసులలోనూ సమర్థుడైన న్యాయవాదిగా దీక్షిత్ పేరు దేశమంతటా మారుమ్రోగింది. బాంబే విశ్వవిద్యాలయం, ఏ నోటరీ పబ్లిక్, జస్టిస్ ఆఫ్ ది పీస్ వంటి కమిటీలకు సహచరుడిగా ఎంపికై అతను తన చక్కటి వాక్చాతుర్యంతో, హావభావాలతో కౌన్సిళ్లలో గొప్ప ఖ్యాతి సంపాదించాడు. అంతేకాదు, అతను తరచూ పలు ప్రజాసంస్థలలో పనిచేస్తుండేవాడు. రాజకీయ, సామాజిక, పురపాలక వ్యవహారాలలో పాలుపంచుకుంటూ ప్రజానీకానికి ఉన్నత సేవలు అందిస్తూ అటు ప్రజలలో, ఇటు ప్రభుత్వ వర్గాలలో అతను గొప్ప ఖ్యాతిని, ప్రజాదరణను గడించాడు. అతను రాజకీయంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెసులో సభ్యునిగా సర్ ఫిరోజ్ షా మెహతాకు ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. 1901లో అతను బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎంపికయ్యాడు. అయితే తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కార్పొరేషన్ పదవికి రాజీనామా చేసిన అతని దేశభక్తి, ఆత్మసమర్పణ ఎనలేనివి. దీక్షిత్ తన ప్రతిభాపాటవాలతో త్వరితగతిన గొప్ప గౌరవప్రదమైన పదవులు అందుకుంటూ అదే స్థితిలో కొనసాగితే అతను ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా, ఏదైనా రాష్ట్రానికి కమిషనర్ కూడా అయ్యేవాడు. కావాల్సినంత జీతభత్యాలు, తుపాకీ కాల్పుల గౌరవ వందనాన్ని పొందేవాడు. కానీ అతని ప్రారబ్ధం, ఏదో ఋణానుబంధం అతనిని మరో మార్గంలో తీసుకెళ్లింది. సామాన్య దృష్టికి ఆ మలుపు దురదృష్టంగా అనిపించవచ్చుగానీ, అది సద్గురు సాయి యొక్క అపారమైన కృపకు పాత్రుని చేసింది. అతనికి శిరిడీ దర్శించాలన్న ప్రేరణ కలిగిన వైనం, తమ దర్శనాన్ని ప్రసాదించేందుకు బాబా చేసిన ప్రణాళిక ఆసక్తిదాయకంగా, సంతోషదాయకంగా ఉంటాయి.

Комментарии

Информация по комментариям в разработке