Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть జాతరలో వైఫల్యాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు

  • 10 StarNews
  • 2025-09-14
  • 83
జాతరలో వైఫల్యాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు
  • ok logo

Скачать జాతరలో వైఫల్యాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно జాతరలో వైఫల్యాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку జాతరలో వైఫల్యాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео జాతరలో వైఫల్యాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు

జాతరలో వైఫల్యాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు
వైసిపి హయాంలో జాతర రాబడి రూ 30 లక్షలు కాగా ఈ ఏడాది రూ 23 లక్షలు రావడం ఏంటి?
ఒక్కో ఎమ్మెల్యే 100 మంది తో విఐపి దర్శనాలకువచ్చి టిడిపి జాతరగా మారుస్తారా
శాంతి సంఘం సమావేశంలో విఐపి లకు ఐదు మందితో మాత్రమే దర్శనమన్న ఎమ్మెల్యే ఇచ్చిన మాటను తుంగలో తొక్కిందెవరు
వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూ లైన్ లేక తీవ్ర ఇబ్బందులు
వైసిపి హయాంతోపాటు టిడిపి హయాంలో కూడా గొల్ల గుంట కుటుంబానికి పోలేరమ్మ జాతరను అప్పగించడం దేనికి నిదర్శనం
టిడిపి, జనసేన, బిజెపి ల్లో దేవస్థానం కమిటీ చైర్మన్ గిరి స్థాయి నాయకుడు లేరా
జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటగిరి నియోజకవర్గ పిఓసి గూడూరు వెంకటేశ్వర్లు ఫైర్

దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ఈ ఏడాది ఆది నుంచి అపస్రుతులు వైఫల్యాలతో అట్టర్ ప్లాప్ జాతరగా నిర్వహించి జాతర విజయవంతం చేశామని సంబరాలు చేసుకోవడం సమంజసం కాదని, వాటికి కారణమైన వారికి పోలేరమ్మ అమ్మవారు తగిన గుణపాఠం చెబుతుందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటగిరి నియోజకవర్గ పిఓసి గూడూరు వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి జాతరను రాష్ట్ర పండుగ ప్రకటించి ప్రభుత్వం జాతరకు ప్రత్యేక నిధులను మంజూరు చేయించే వెసులుబాటు కల్పించారన్నారు. అయితే తనకు ఊహ తెలిసినప్పటినుండి ఈ ఏడాది జరి జాతరలో జరిగిన వైఫల్యాలు, సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం వంటి వాటిని చూడలేదన్నారు . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలకు లోబడి టిడిపికి నియోజకవర్గంలో కష్టపడి పనిచేశామని, అయితే జాతరలోఎక్కడ తమకు ఆ స్థాయిలో ప్రాధాన్యత కనిపించలేదన్నారు. వైసిపి హయాంలో పోలేరమ్మ దేవస్థానం చైర్మన్గా పనిచేసిన గొల్లగుంట మురళీకృష్ణ టిడిపి కూటమి హయాంలో కూడా ఆయననే పోలేరమ్మ దేవస్థానం చైర్మన్గా నియమించడం టిడిపి జనసేన బిజెపి ల్లో ఆ స్థాయి నాయకుడు లేరా అని ప్రశ్నించారు. జాతరలో ఆ కుటుంబం సోదరులు అమ్మవారి చుట్టూ రథంపై ఆసీనులై మొత్తం జాతరనే ఆ కుటుంబానికి దారాదత్తం చేసిన విధంగా నిర్వహించడం ఏమిటన్నారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు వెంకటగిరికి, జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఉన్న ఆయన చుట్టూ ఉన్న దుష్టశక్తులు తప్పు దోవ పట్టించి జాతర వైఫల్యానికి కారణమయ్యారని చెప్పారు. దశాబ్దాలుగా దేవస్థానం ఈవోగా కొనసాగుతున్న శ్రీనివాసులు రెడ్డిని మార్చకపోవడం ఏమిటన్నారు. పోలేరమ్మ జాతరకు సంబంధించి ఆదాయం వ్యయం వివరాలడిగితే నోటీసులు పంపించి ఫలానా సెక్షన్ ప్రకారం జమా ఖర్చులు ఇవ్వమని చెప్పే దేవాదాయ శాఖ అధికారులు భక్తుల నుంచి ఏ సెక్షన్ ప్రకారం విరాళాలు స్వీకరిస్తున్నారు చెప్పాలన్నారు. జాతర చాటు నుంచి ఘటోత్సవం అమ్మవారి విరుపోత్సవం వరకు ఆచార వ్యవహారాలకు తిలోదకాలు ఇచ్చారని, జాతరలో వెంకటగిరి రాజాలకు దక్కాల్సిన ప్రాధాన్యాన్ని ఇవ్వలేదని విమర్శించారు. పోలీసులు, రెవెన్యూ వంటి డ్యూటీ అధికారులు తమ కుటుంబాలతో పాటు తెలిసిన వాళ్ళ ను రాజమార్గంలో ఉచితంగా అమ్మవారి దర్శనానికి పంపుతుంటే రూ 300 పెట్టి టికెట్ కొనుక్కొని దర్శనానికి వేచి ఉన్న భక్తులు తమ వద్ద ఉన్న పోలీసులతో వాగ్వివాదానికి దిగడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఎదుర్కున్నారన్నారు. జాతర ముందు నిర్వహించిన శాంతి సంఘం సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కు ఐదు మందితో మాత్రమే దర్శనం కల్పిస్తామని చెప్పిన మాటను స్థానిక దేవాదాయశాఖ అధికారులు తుంగలో తొక్కి ఒక్కో ఎమ్మెల్యే తో సుమారు 150 మంది వరకు వీఐపీ దర్శనాలను కల్పించి జాతర ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. వృద్ధులకు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయలేని అధికారులు టిడిపి నాయకులకు మాత్రం ప్రత్యేక దర్శనాలను కల్పించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. వైసిపి హయాంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాతర అన్ని వర్గాలను ఆకట్టుకుందని ఇప్పటికీ పోలేరమ్మ భక్తుల్లో ఉందన్నారు. ఆయన సొంత నిధులు రూ 1.50 లక్షలతో టిక్కెట్లు కొని వీఐపీలకు మీడియాకు ఇచ్చి ప్రత్యేక దర్శనాలు చేయించారని, నేడు దేవాదాయ శాఖ అధికారులు విఐపి పాసులు రద్దు అని ప్రకటించి, బోగస్ ఐడి కార్డులను ప్రోత్సహించి కుటుంబాలకు కుటుంబాలు విఐపి దర్శనం కల్పించడం వలన దేవస్థానం ఆదాయం భారీగా పడిపోయిందని ఆరోపించారు. ఏడాదిపాటు అమ్మవారి దేవస్థానం వార్తలు కవర్ చేసే స్థానిక మీడియా, అమ్మవారి సేవకు సహకారం అందించే డోనర్లకు మొండి చేయి చూపించి టిక్కెట్లు కొనుక్కొని దర్శించు కోవాలనడం ఏమిటన్నారు. ఆర్టీసీ సైతం అనంతపురం సూపర్ సిక్స్ సభకు బస్సులను మళ్లించి పోలేరమ్మ జాతరకు వచ్చే భక్తులను పట్టించుకోలేదని విమర్శించారు. 300 దర్శన టికెట్ తీసుకున్న భక్తులకు అరకొరగా ప్రసాదం అమ్మవారి పసుపు కుంకుమ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. అమ్మవారి ఊరేగింపుకు హైడ్రాలిక్ రథాన్ని సమకూరుస్తామన్న పెద్దల మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]