తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ :

Описание к видео తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ :

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంది. ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా దీనిని ఓపెన్ చేసింది. ఆలయంలోని ఈ రహస్య గదిని తెరిచిన అనంతరం సిబ్బంది లోపలకు జాగ్రత్తగా ప్రవేశించారు. స్నేక్ క్యాచర్స్ తో పాటు వైద్య బృందాన్ని కూడా అక్కడే ఉంచారు. కానీ రత్నభాండాగారం లోపలకు వెళ్లిన ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తలుపులు తెరిచేందుకు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్ రథ్, జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీతోపాటు ASI సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు. వీళ్లతోపాటు నలుగురు సహాయకులు వెళ్లినట్లు సమాచారం.

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#PuriJagannath #ratnabhandar #odisha #tv9D

Credits : #Rajeswari / Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке