AP : పోలీసులతో మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. ఏపీలో ఈ వివాదాలేంటి, CM Chandra babu ఏమన్నారు?

Описание к видео AP : పోలీసులతో మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. ఏపీలో ఈ వివాదాలేంటి, CM Chandra babu ఏమన్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులతో ‘దురుసుగా’ ప్రవర్తించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
మరో ఘటనలో తిరుపతి కార్పొరేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్న కుమారుడు పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ ఆసుపత్రి తనిఖీ చేయడం వివాదాస్పదమైంది.
అయితే, స్థానిక సమస్యలపై మాట్లాడడానికి తన అన్న కుమారుడు వెళ్లారే కానీ అధికారులతో సమీక్ష జరపలేదని ఎమ్మెల్యే శ్రీనివాసులు ‘బీబీసీ’తో చెప్పారు.

ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరణ ఇచ్చారు.
‘‘ఆ రోజు స్పోర్ట్స్ కు సంబంధించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రోగ్రాం కోసం నేను వైజాగ్ వెళ్లడం జరిగింది. మా తరపున పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మా భార్య పాల్గొనింది. అయితే నాలుగు గ్రామాలు పంపిణీ చేసిన తర్వాత పోలీసులు వచ్చి మీకు బందోబస్తు ఇస్తాము అని చెప్పారు. దీంతో పోలీసులు వస్తారు అని రెండు గంటలు వెయిట్ చేయడం జరిగింది. వాళ్లు లేటుగా వచ్చేసరికి.. మీకు జీతాలు ఇస్తుంది ప్రభుత్వమా లేక వైసిపి వాళ్లా అని అడిగింది అందులో తప్పేముంది. ఎవరిని కావాలని మందలించము. అప్పుడున్న సిచువేషన్ ప్రోగ్రాం కోసం అక్కడివారు ఫోన్లు చేస్తూ ఉండటంతో అలా జరిగింది.’’ అని చెప్పారు.

మిగతా ఘటనలకు సంబంధించి స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది కానీ వారు అందుబాటులోకి రాలేదు.
#andhrapradesh #chandrababu #appolitics #appolice
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке